Friday, September 26, 2008

విశాలాంధ్ర మాతా! నమస్తే!

విశాలాంధ్ర మాతా! నమస్తే!

విశ్వజన విజేతా!

నిత్య సంపూజితా! నమస్తే!

నిఖిల లోక వినుతా!



శాతవాహనులు, గజపతులు,

విజయనగర ఘన నరపతులు

ఓరుగంటి కాకతి నుతులు

నీ సేవలోనె మురిసేరమ్మా!



గలగలా పారు గోదారీ

కిలకిలమనేటి కృష్ణ సాగరీ

మురిసి ఎగసేటి మంజీర ఝరి

నీ పాదములనె కడిగేనమ్మా!



నన్నయార్యుని తొలిపలుకులో

అన్నమయ్య పద కవిత కులుకులో

బమ్మెర పోతన భక్తి రచనలో

నీ తెలుగు తేనెలొలికేనమ్మా!

No comments: